ప్రజల అవసరాల కోసం ప్రారంభిస్తున్న కొత్త రైళ్ళకి ఏ అనారోగ్యం లేకుండానే (పట్టాలు ఎక్కకుండానే) విశ్రాంతి నిచ్చేసారు రైల్వే శాఖ వారు.
రైలు పట్టాలు ఎక్కాలంటే కావాల్సింది ప్రయాణికులూ మరియు సిబ్బందీ, కానీ రైల్వే వారికి ముఖ్యమంత్రి కావాలట.
కొత్త రైలు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రే కావాలని వారు అనుకుంటే, రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా వేరే రైలు వెయ్యాల్సింది. అంతేకానీ ఒకరోజు ముందు రేపటి ట్రైన్ రద్దు అయ్యింది డబ్బులు తిరిగి ఇస్తాం అంటే ప్రయాణికుల పట్ల వీరికి ఉన్న బాధ్యత బాగా అర్ధం అవుతుంది.
సామాన్య ప్రజల అవసరాల కన్నా అధికారంలో ఉన్న నాయకుల మెప్పుదలే ముఖ్యం అన్నట్లు వారు చేసిన పని.
ఓ మనిషి అనారోగ్యానికి వేలమంది ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలి?
మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఆరోగ్యం గా ఉంటారో అప్పుడే ప్రారంభిస్తారా ఏమిటి ఈ రైళ్ళు? నాయకుల అనారోగ్యాలకూ ప్రజావసరాలు బలి అవ్వాలా.
(news courtesy: ఈనాడు)












