మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Showing posts with label Politics. Show all posts
Showing posts with label Politics. Show all posts

Sunday, 22 August 2010

తెలుగు తల్లి అంటే ఉలుకు ఎందుకు?


ఎప్పుడు చూసినా టి. ఆర్. యస్ అధ్యక్షులు తెలుగు తల్లి అంటే మండి పడుతూ ఉంటారు. అది ఎందుకో నా మట్టి బుర్రకు ఎప్పుడూ అంతుపట్టదు.

తెలుగు తల్లి అనేది తెలుగు భాషకు మాతృస్తానం ఇచ్చి తెలుగు ప్రజలందరూ గౌరవించు కోవటం అనుకుంటున్నాను. తెలంగాణలో ఉండాల్సింది తెలుగు తల్లి కాదు తెలంగాణా తల్లి అనటం ఏమిటో దానికి తెలంగాణా మేధావులు వంతపాడటం ఏమిటో నాకు అర్ధం కావటం లేదు. తెలంగాణా కావాలనుకునే వారి ఆకాంక్ష ను నేను తప్పు పట్టటం లేదు. తెలంగాణా, కోస్తాంధ్ర, రాయల సీమ అనేవి త్రిలింగ దేశం లోని వివిధ ప్రాంతాలకు ప్రతిరూపం గా చెప్పుకునే పేర్లు. కానీ తెలుగు అనేది ఈ మూడు ప్రాంతాల ప్రజలు మాట్లాడుకునే భాష. మాండలికాలు, యాసలు వేరు అయినంత మాత్రాన మాతృభాష మారదుగా.

తెలుగు తల్లి అనేది తెలుగు ప్రజలందరికి తల్లే కదా? తెలంగాణా లోని భాష తెలుగు కాదా? ఆంధ్ర తల్లి అనో సీమ తల్లి అనో అని ఎవరన్నా అంటే అప్పుడు తెలంగాణా తల్లి అనే వాదన తీసుకు రావటం లో అర్ధం ఉంటుంది.

భాషకు మాతృస్తానం ఇచ్చి నప్పుడు ఏ ప్రాంతం వారు అయినా దాన్ని వ్యతిరేకించటం అర్ధ రహితం. తెలంగాణా కావాలనుకునే ఆకాంక్ష కోసం తెలుగు భాషను చిన్నబుచ్చ వద్దు.

మీ

స్నేహితుడు

(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)

Thursday, 10 September 2009

సోనియా జీ..... మాకున్న అర్హత 30 ఏళ్ల నెహ్రూ కుటుంబ విధేయత & ఓ కర పత్రిక



జగన్ ని ముఖ్యమంత్రి ని చెయ్యటానికి ఆయన గారి పత్రిక ఎంత కంకణం కట్టుకుందోఈ రోజు పేపర్  యాడ్ ని చూస్తేనే అర్ధం అవుతుంది.

2014 లో రాహుల్ గాంధీ ని ప్రధాని చెయ్యాలనే వై.ఎస్ గారి కలని పదే పదే (దాదాపు ప్రతి రోజూ పేపర్ లో టీవీ లో ఇదే భజన) ప్రస్తావించటం దారా రాష్ట్రం లో తమను మించిన విధేయులు వారికెవరూ దొరకరని చెప్పకనే చెప్పేవాళ్ళు. ఈ రోజు దాన్ని పబ్లిక్ గా చెప్పుకున్నారు.

"2014 నాటికి రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధాని... ప్రజలు తప్పకుండా పట్టం కడతారు " ఈ మాటలన్న వై.ఎస్. ధీమా వెనక ఉన్నది రాహుల్ పై అభిమానమే కాదు ఆ కుటుంబం పై ఉన్న మూడు దశాబ్దాల విధేయత.

అసలు నాకర్ధం కానిది ఈ కాంగ్రెస్ వాళ్ళకి నెహ్రూ గారి వారసుల మీద ఉన్న విధేయత జాతి పిత గాంధీ గారి వారసుల మీద ఏ నాడూ ఉండదు ఎందుకని.?

ఆయన వారసులు ఏ అత్యున్నత పదవుల్లోనూ లేరు కాబట్టి.

రాజ్యాంగ పరం గా అత్యున్నత పదవుల్లో ఉన్న వారికి విధేయులై ఉంటే తమకూ ఓ పరగణా కు ఆధిపత్యం వహించే అవకాసం ఉంటుంది కాబట్టి.

ప్రజలకు కావాల్సింది నెహ్రూ గారి కుటుంబం మీద విధేయత ఉన్న వాళ్ళు కాదు. ప్రజల మీద ప్రజాస్వామ్యం మీద విధేయత ఉన్న వాళ్ళు కావాలి.

మా తాతలు నేతులు తాగారూ మా మూతులు వాసన చూడండీ అన్నట్టు గాంధీ దగ్గర నుండి వై.ఎస్. వరకూ ప్రజల మీద ఉన్న విధేయత ఉన్నంత మాత్రాన ఆ విధేయత మాకూ ఉంది అంటే కుదురుతుందా...

కొన్నాళ్ల పాటు దాన్ని నిరూపించుకుంటే వారసత్వం దానికదే వస్తుంది.



మీ
స్నేహితుడు

(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)